మంత్రి నివాళి
పెద్దపల్లి జిల్లా రామగుండం శాసనసభ్యుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోదరుడు శైలందర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి శ్రీధరబాబు హాజరై నివాళులు అర్పించారు.
ఇట్టి కార్యక్రమానికి ఎమ్మెల్సి జీవనరెడ్డి, పెద్దపల్లి ఎం ఎల్ ఏ చింతకుంట విజయరమణారావు, ఏసీపీ రమేష్, స్థానిక మేయర్ బంగి అనిల్, కాంగ్రెస్ మహిళా నాయకురాలు నాజియా తదితరులు పాల్గొని శైలందర్ చిత్రపటానికి నివాళులు అర్పించి, వారు పార్టీ కి చేసిన సేవలను కొనియాడారు.